ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్‌ మెట్రో

62చూసినవారు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్‌ మెట్రో
ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో రైలు శుభవార్త చెప్పింది. ప్రయాణికులకు అందిస్తున్న ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అందిస్తున్న సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే అక్టోబర్ 6 నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్