గాజాలో గత 9 నెలలుగా ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల్లో 6,050మంది విద్యార్ధులు చనిపోయారని పాలస్తీనా విద్యా శాఖ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. 10,219 మంది గాయపడ్డారు. గాజాలో 5,994మంది మరణించగా, 9890మంది గాయపడ్డారని, వెస్ట్ బ్యాంక్లో 56మంది విద్యార్ధులు చనిపోగా, 329మంది గాయపడ్డారని, 105మందిని నిర్బంధించారని పాలస్తీనా ఇన్ఫర్మేషన్ సెంటర్ తెలిపింది. ఇప్పటివరకు అక్కడ 266 మంది టీచర్లు, స్కూల్ అడ్మినిస్ట్రేటర్లు చనిపోగా.. 973మంది గాయపడినట్లు తెలుస్తోంది.