'ఏపీలో పేదలకు చెందాల్సిన 8,086 ఎకరాల భూమిని అప్పనంగా వైసీపీ నేతలు రాయించేసుకున్నారు. కడప జిల్లాలో 3,357 మందికి 5,796 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 856 మందికి 1,145 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 3,471 మందికి 5,554 ఎకరాలు.. ఇలా సాగిన ఆ దోపిడీ విలువ రూ.1,300 కోట్లు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఎసైన్డ్ భూములను వైకాపా హయాంలో పెద్దలు చౌకగా కొనేశారు.' అని సీఎం చంద్రబాబు ఆరోపించారు.