తైవాన్లో సంభవించిన భారీ భూకంపం ఆ ద్వీపాన్ని అతలాకుతలం చేసింది. ఈ భూకంపం కారణంగా ఇప్పటికే 9 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇక భూకంపం వల్ల రెండు బొగ్గు గనులు కూలడంతో అందులో 70 మంది కార్మికులు చిక్కుకున్నట్లు వెల్లడించారు. వీరంతా అందులో పనిచేస్తుండగా గనులు కూలాయి. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.