‘ఏపీలో పొత్తు చీలిపోయింది’

1570చూసినవారు
‘ఏపీలో పొత్తు చీలిపోయింది’
బీజేపీ సీనియర్ నేత అంబికా కృష్ణ టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తు వల్ల బీజేపీకి రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఏపీలో ఏ పార్టీతో పొత్తు వద్దని అధిష్టానానికి లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. నిజమైన బీజేపీ నాయకులకు టికెట్ దక్కలేదని, ఏపీలో పొత్తు చీలిపోయిందన్నారు. టీడీపీ అభ్యర్థులకు బీజేపీ కార్యకర్తలు సహకరించే పరిస్థితి లేదన్నారు.

సంబంధిత పోస్ట్