లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ దశలో 13 రాష్ట్రాల్లోని 89 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉఖ్రుల్ ఔటర్ మణిపూర్లో పార్లమెంట్ స్థానానికి ఓటింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఓ 94 ఏళ్ల వృద్ధురాలు తన ఓటును వినియోగించుకుంది. ఔటర్ మణిపూర్ సీటు పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు రెండో విడతలో పోలింగ్ జరుగుతోంది.