సికింద్రాబాద్లోని ఆల్వాల్ పరిధి భారతి నగర్లో దారుణ హత్య జరిగింది. అర్థరాత్రి బావమరిదిని బావ బండరాయితో కొట్టి చంపాడు.
యుగంధర్ను తన బావ సుబ్రహ్మణ్యం బండరాయితో కొట్టి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సుబ్రహ్మణ్యం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.