విదేశీయులకు కూడా ఆధార్ జారీ చేయొచ్చని ఉడాయ్ తాజాగా స్పష్టం చేసింది. చట్టబద్ధంగా దేశంలోకి వచ్చిన నివాసేతరులకు కూడా ఇస్తామని పేర్కొంది. విదేశీయుడని పేర్కొంటూ తన ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేశారని ఓ ఫిర్యాదుదారుడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. ఆ కేసు విచారణ సందర్భంగా.. ఆధార్కు పౌరసత్వంతో ఎలాంటి సంబంధం లేదని ఉడాయ్ కోర్టుకు విన్నవించింది.