ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్లో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సరదగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు యువకులపైకి భారీ వేగంతో వస్తున్న కారు దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు యువకులు ఘటనా స్థలిలోనే మృతి చెందారు. కాగా క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం, ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.