బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కడలూరులో ఎన్నికల రోజు జరిగిన హత్యను డీఎంకేకు లింక్ చేస్తూ ఆయన ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో ఆయనపై శ్రీముష్టం స్టేషన్లో పోలీసులకు డీఎంకే యువజన కార్యదర్శి స్వామినాథన్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అన్నామలైపై FIR నమోదు చేశారు.