'NEETపై కోర్టు పర్యవేక్షణలో విచారణ చేయించాలి'

56చూసినవారు
'NEETపై కోర్టు పర్యవేక్షణలో విచారణ చేయించాలి'
NEET పేపర్ లీకేజీ వెనుక ఉన్న వ్యక్తులను బయటపెట్టేందుకు కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం లక్నోలో మీడియాతో మాట్లాడారు. పేపర్ లీక్‌ కారణంగా యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేయడంపై కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరగడం వల్ల అర్హత, సమర్థత కలిగిన వైద్యుల కొరత పెరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్