ఎండాకాలంలో మన శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆహార పదార్థాల్లో కీర దోస ఒకటి. కీరదోసను తినడం వల్ల శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు కీరదోసను తింటే ఆ సమస్యలు తగ్గుతాయి. ఎండలో తిరిగినపుడు కీరదోసను రౌండ్ గా కట్ చేసి కళ్లకు 20 నిమిషాల పాటు ఉంచుకుంటే కళ్లపై ఒత్తిడి పడకుండా చూసుకోవచ్చు.