జమ్మూ కశ్మీర్లో భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 2.53 గంటల ప్రాంతంలో కిష్త్వార్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. అదృష్టవశాత్తూ, భూకంపం యొక్క తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.