లోక్ సభ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేయనున్నారు. నామినేషన్ దాఖలు చేసుందుకు అమిత్ షాతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ కూడా హాజరయ్యారు. గాంధీనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సోనాల్ పటేల్ బరిలో ఉన్నారు. 2019లో అమిత్ షా గాంధీనగర్ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. గాంధీ నగర్ స్థానానికి మే 7న మూడో దశలో పోలింగ్ జరగనుంది.