ఏపీలో కలకలం రేపుతున్న అతిసారం

62చూసినవారు
ఏపీలో కలకలం రేపుతున్న అతిసారం
ఏపీలోని గుంటూరు జిల్లాలో అతిసారం కలకలం రేపుతోంది. చేబ్రోలు మండలం మంచాలలోని ఓ వీధిలో నివాసముంటున్న వారంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వాంతులు, విరోచనాలతో బాధపడుతూ100 మందికి పైగా మంచం పట్టారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా సమస్యలతో బాధపడుతున్నా వైద్యాధికారులు గ్రామానికి రావటం లేదని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్