నెస్లేపై విచారణ చేపట్టాల్సిందిగా FSSAI ని కేంద్రం శుక్రవారం తెలిపింది. నెస్లే చిన్నారుల ఆహార ఉత్పత్తుల నివేదికను పరిశీలించాల్సిందిగా ఫస్సీకి లేఖ రాసినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చిన్నారుల ఉత్పత్తుల్లో అత్యధిక చక్కెరలు వారి ఆరోగ్యం, భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) చీఫ్ నిధి ఖారే తెలిపారు.