తెలంగాణలోని జనగామ జిల్లా పసరమట్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు కలెక్టరేట్ భవనం పైకెక్కి సూసైడ్ చేసుకున్నాడు. తన భూమిని ఇతరులకు పట్టా చేశారని.. కలక్టరేట్ బిల్డింగ్ ఎక్కి పురుగుల మందు తాగాడు. తాము బతికి ఉన్నప్పటికీ చనిపోయారంటూ తమ భూమిని ఇతరులకు పట్టా చేశారని నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.