హైదరాబాద్లో గోల్డ్ ట్రేడింగ్ పేరుతో రాజేశ్ అనే వ్యక్తి అధిక లాభాలు ఆశ చూపి దాదాపు 500 మందిని మోసగించాడు. అధిక లాభాలు ఆశ చూపి ఒక్కొక్కరి వద్ద రూ.5లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసి రాజేశ్ పరారయ్యాడు. 2 నెలలుగా తప్పించుకొని తిరుగుతోన్న రాజేశ్ను సీసీఎస్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బాధితులు తమకు న్యాయం చేయాలంటూ బషీర్బాగ్లోని సీసీఎస్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.