భర్త మరణాన్ని తట్టుకోలేక.. భార్య ఆత్మహత్య

78చూసినవారు
భర్త మరణాన్ని తట్టుకోలేక.. భార్య ఆత్మహత్య
భర్త మరణాన్ని తట్టుకోలేకపోయిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. అస్సాంకు చెందిన జుమీదాస్, ఆమె భర్త భాస్కర్ డేకా ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో నివసిస్తున్నారు. బాస్కర్ సూసైడ్ లేఖ రాసి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ లేఖలో భార్యపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. భర్త మృతిని తట్టుకోలేక భార్య జుమీ యమునా ఖాదర్ ప్రాంతంలో నీటి పైప్‌లైన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్