నేపాల్ లో కారు గోతిలో పడి ఇద్దరు భారతీయులు మృతి

51చూసినవారు
నేపాల్ లో కారు గోతిలో పడి ఇద్దరు భారతీయులు మృతి
దక్షిణ నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఘటనలో ఇద్దరు భారతీయులు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన తమన్నా షేక్ (35), ఇర్ఫాన్ ఆలం (21) గా గుర్తించారు. ఈస్ట్ వెస్ట్ హైవే వెంబడి చంద్రనిగహ్‌పూర్ స్ట్రెచ్‌లోని రోడ్డు వెంట లోయలో పడిపోవడంతో మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు.మరో నలుగురు గాయపడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్