రైలు కింద పడి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న విషాధ సంఘటన కర్నూల్ జిల్లా మద్దికెర రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. మృతులు గుంతకల్లుకు చెందిన మీనా, కులదీప్ గా పోలీసులు గుర్తించారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఘటనాస్థలంలో ఓ నోట్ బుక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో "మా ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదు” అని రాసి ఉందని తెలిపారు.