బంగ్లాదేశ్లో ఢాకా నుంచి తారకండి వెళ్లే ఇంటర్సిటీ అగ్నివీణ ఎక్స్ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. రిమాల్ తుఫాన్ ప్రభావంతో ఉదయం నుంచి భారీగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఓ చెట్టు నేలకూలి రైల్వే లైన్పై పడింది. స్థానికులు ఎర్ర జెండాలు పట్టుకుని రైలును ఆపాలని ప్రయత్నించారు. వారిని చూసి లోకో పైలట్ ట్రైన్ వేగాన్ని తగ్గించాడు. దీంతో ట్రైన్కు ప్రమాదం తప్పింది.