బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రీమియం సబ్స్క్రైబర్లకు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ‘ఎక్స్ఏఐ’ కృత్రిమ మేధ సంస్థ అభివృద్ధి చేసిన ఏఐ చాట్బాట్ గ్రోక్ ను వచ్చేవారం ప్రీమియం చందాదారులందరికీ అందించనున్నట్లు మస్క్ మంగళవారం వెల్లడించారు. ఇప్పటి వరకు ఇది కేవలం ప్రీమియం ప్లస్ సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.