వర్షంలో 8 కిలోమీటర్లు పరుగెత్తి.. మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్‌ డాగ్‌

84చూసినవారు
వర్షంలో 8 కిలోమీటర్లు పరుగెత్తి.. మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్‌ డాగ్‌
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఓ పోలీస్ డాగ్ సాహసం చేసింది. గురువారం సంతబెన్నూరులోని పెట్రోలు బంక్‌ సమీపంలో సంతోష్‌ అనే వ్యక్తి హత్యకు గురి కాగా, ఆ మృతదేహాన్ని పోలీస్ డాగ్ తుంగ 2 వాసన చూసింది. జోరు వానలో 8 కి. మీ పరుగుతీసి చన్నాపురా గ్రామంలోని హంతకుడి ఇంటికి చేరింది. ఈ క్రమంలోనే తన భార్యను కొట్టి చంపుతుండగా పోలీసులు హంతకుడ్ని పట్టుకున్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో రంగస్వామి ఈ హత్య చేసినట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్