మామిడిపళ్ల థీమ్‌తో పోలింగ్ స్టేషన్.. ఎక్కడో తెలుసా?

565చూసినవారు
మామిడిపళ్ల థీమ్‌తో పోలింగ్ స్టేషన్.. ఎక్కడో తెలుసా?
పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ధర్మపురిలో ఓ పోలింగ్ స్టేషన్ ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చే వారికి స్వాగతం చెబుతున్నట్లుగా మామిడి పళ్లను ఉంచారు. పోలింగ్ స్టేషన్ ను బెలూన్లతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వాగతం, సుస్వాగతం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓట్ల పర్వం, ఓటే సర్వం అనే నినాదంతో ప్రజాస్వామ్య పండుగలో అందరం పాల్గొందాం అంటూ వినూత్నంగా పోలింగ్ కేంద్రాన్ని ముస్తాబు చేశారు. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్