మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ కు షాక్.. అలా కుదరదన్న హైకోర్టు

58చూసినవారు
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ కు షాక్.. అలా కుదరదన్న హైకోర్టు
మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి హైకోర్టు షాక్ ఇచ్చింది. తనకు ప్రాణ హాని ఉందని.. 4+4 గన్ మెన్‌లను కేటాయించాలని హైకోర్టులో శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. గన్ మెన్‌లు అవసరమో లేదో తెలపాలని డీజీపీకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్