విశాఖలో మత్స్యకారుల పడవలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

77చూసినవారు
విశాఖలో మత్స్యకారుల పడవలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
మత్స్యకారుల పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పడవలో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకారు. విశాఖ జిల్లాలోని ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి వాసుపల్లి అప్పయ్యమ్మకు చెందిన ఓ బోటులో ఐదుగురు మత్స్యకారులు వేటకు బయలుదేరి వెళ్లారు. తీరానికి 35 మైళ్ల దూరంలో వెళ్లగానే బోటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి బోటు పూర్తిగా దగ్ధమైంది. ఇక సముద్రంలోకి దూకిన మత్స్యకారులను కోస్ట్‌గార్డు సిబ్బంది రక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్