బీహార్లోని సమస్తిపూర్లో ప్రెజర్ లీక్ కారణంగా రైలు బ్రిడ్జి మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో లోకో పైలట్స్ తమ ధైర్యాన్ని ప్రదర్శించి, ఇంజిన్లోని లీకేజీని సరిచేయడానికి రైలులోపల ఉన్న వంతెన కిందకి పాకుతూ వెళ్లి.. సమస్యను క్లియర్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే డిపార్ట్మెంట్ వినయ్, శ్రీవాస్తవ ఇద్దరు లోకో పైలట్లకు 10,000 రూపాయల రివార్డును ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.