ఇండోనేషియా దక్షిణ సులవేసి ప్రావిన్స్ కలెంపాంగ్ గ్రామంలో విషాద ఘటన జరిగింది. ఫరీదా(45) అనే మహిళ గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. ఆమె గురించి భర్త సమీపంలోని అటవీ ప్రాంతంలో వెదుకుతుండగా ఆమె వస్తువులు కనిపించాయి. సమీపంలో 16 అడుగుల కొండచిలువ ఉంది. దానిని కోసి చూడగా ఫరీదా తల, మొండెం కనిపించాయి. కొండచిలువకు తన భార్య ఆహారం కావడంతో ఆమె భర్త బోరున విలపించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.