హైదరాబాద్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. 23 ఏళ్ళ వయసు ఉన్న క్యాబ్ డ్రైవర్ సాయి కిరణ్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా, మాదాపూర్ పోలీసులు సాయి కిరణ్ను కాపాడారు. తరువాత పోలీసులు అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు.