ప్రేమించిన యువతితో ఫోన్ లో మాట్లాడుతూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా తాండూర్కు చెందిన ఇమ్రోజ్పటేల్(29) రాజేంద్రనగర్లో నివాసం ఉంటున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న ఇమ్రోజ్ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తగా ఆ యువతి ఇమ్రోజ్ను దూరం పెట్టింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఇమ్రోజ్మంగళవారం రాత్రి యువతికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఉరేసుకున్నాడు.