ICC CT చరిత్రలో ఫైనల్ పోరులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి కెప్టెన్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. అదేవిధంగా భారత్కు అత్యధిక ఐసీసీ టైటిల్స్ను అందించిన రెండో కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2007, వన్డే ప్రపంచకప్-2011, ఛాంపియన్స్ ట్రోఫీ-2013లను భారత్ కైవసం చేసుకుంది. ధోని మొత్తంగా భారత్కు మూడు టైటిల్ను అందించగా.. రోహిత్ రెండు టైటిల్స్ను సాధించాడు.