తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల గురించని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయన్నారు. ఇదే నిజమైతే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. గతంలోనూ ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని డిమాండ్ వచ్చిందని, ఈ నిర్ణయాన్ని గతంలో తాము వ్యతిరేకించామని గుర్తు చేశారు.