హైకోర్టు ఆదేశాల మేరకు.. పరిశీలనకు నిపుణుల బృందం

52చూసినవారు
హైకోర్టు ఆదేశాల మేరకు.. పరిశీలనకు నిపుణుల బృందం
హైకోర్టు ఆదేశాల మేరకు పూరి జగన్నాథ్ ఆలయంలోని రత్న భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్‌ 4న నిపుణుల బృందం పరిశీలనకు వెళ్లింది. అయితే, రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. కిటికీ ద్వారా పరిశీలించిన బృందం.. పైకప్పుల పెచ్చులు ఊడటాన్ని గమనించారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్‌ తాళం లభ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్