హైదరాబాద్లో దారుణం జరిగింది. ఇక్ఫాయి యూనివర్సిటీ హాస్టల్లో బీటెక్ విద్యార్థిని లేఖ్యపై యాసిడ్ దాడి జరిగింది. తోటి విద్యార్థిని రంగు బాటిల్ అనుకోని.. లేఖ్య స్నానం చేసే బకెట్ లో యాసిడ్ పోసింది. చూసుకోకుండా స్నానం చేయడంతో ఒళ్ళంతా యాసిడ్ పడి కమిలిపోయింది. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. దీంతో హుటాహుటిన లేఖ్యను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.