ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి నటి సంభావనా సేథ్ రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పార్టీని వీడాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఎక్స్ (ట్విట్టర్)లో ఆదివారం ప్రకటన చేశారు. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చానని, తన తప్పు తెలుసుకుని AAPని వీడుతున్నానని ఆమె పేర్కొంది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని పేర్కొంటూ 2023 జనవరిలో ఆమె AAPలో చేరారు.