యువరైతు కుటుంబానికి పరామర్శ

1082చూసినవారు
యువరైతు కుటుంబానికి పరామర్శ
జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన దేవళ్ల సాయికుమార్ అనే యువరైతు ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మాల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మనోధైర్యంతో ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్