అవసర సమయంలో రక్తదానం చేసిన కేఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు

1529చూసినవారు
అవసర సమయంలో రక్తదానం చేసిన కేఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు
ఇంద్రవెల్లి మండలం పాటగూడ వద్ద టాక్టర్ బోల్తా పడిన ఘటనలో గాయపడ్డవారు ఆదిలాబాద్ రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇందులో భాగంగా క్షతగాత్రులకు రక్తం తప్పనిసరి అని వైద్యులు సూచించారు. దీంతో అత్యవసర సమయంలో కెఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు సోమవారం స్పందించారు. సుమారు ఐదు మంది క్షతగాత్రుల చికిత్స కోసం రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. వీరిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్