కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ కాలనీలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుస్తూ ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టణ అధ్యక్షులు అజయ్, అష్రాఫ్, కోవ రవి, సంజయ్, భరత్, రామ్ కుమార్ ఉన్నారు.