ఎన్నికల నియమావళి లో భాగంగా జైనథ్ మండలంలోని పిప్పర్ వాడ టోల్ ప్లాజా వద్ద గల అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి ధ్రువపత్రాలు లేని లక్ష రూపాయల నగదును శుక్రవారం అధికారులు సీజ్ చేశారు. ఓ వ్యక్తి వాహనాన్ని ఎన్నికల సిబ్బంది తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని ఒక లక్ష నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు జైనథ్ సీఐ సాయినాథ్ వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ పురుషోత్తం, ఎస్ఎస్టీ సభ్యులు తదితరులు ఉన్నారు.