మృతదేహంతో ఎస్. ఈ కార్యాలయం ఎదుట ధర్నా

7267చూసినవారు
కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన జూనియర్ లైన్ మెన్ పవన్ కళ్యాణ్ మృతదేహంతో కుటుంబీకులు ఆందోళన దిగారు. ఆదిలాబాద్ లో సోమవారం విద్యుత్ స్తంభంపై మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ సప్లయ్ కావడంతో స్తంభంపై నుండి కిందపడి పవన్ కళ్యాణ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తమకు న్యాయం చేయాలని మృతుని కుటుంబీకులు మంగళవారం అంబులెన్స్ లో మృతదేహాన్ని తీసుకువచ్చి, విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

సంబంధిత పోస్ట్