పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ నుండి సస్పెన్షన్కు గురైన ఆదిలాబాద్ మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, మాజి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్రెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గాంధీ భవన్ లో వీరికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు