మారెమ్మ ఆలయంలో చోరీ

15043చూసినవారు
ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద గల మారెమ్మ ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని గర్భగుడి తాళాలు పగులగొట్టి హుండీని లూటీ చేశారు. అందులో ఉన్న 40 వేల రూపాయల నగదు, అర్ధ తులం బంగారం, 10 తులాల అమ్మవారి వెండి ఆభరణాలను దొంగలు దోచుకెళ్ళారు. ఆదివారం ఉదయం ఆలయానికి వచ్చిన సిబ్బంది చోరీ జరిగినట్లు గుర్తించి ఆలయ కమిటీ సభ్యులకు సమాచార అందించారు. దీంతో వీరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్