ఖైరిగుర ఓసీని సందర్శించిన జీఎం

77చూసినవారు
రెబ్బెన మండలం బెల్లంపల్లి ఏరియా జీఎం ఎం శ్రీనివాస్ ఖైరిగుర ఓసీని సోమవారం సందర్శించారు. ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో ఉత్పత్తి వివరాలను తెలుసుకున్నారు. వెస్ట్ వ్యూ పాయింట్ నుండి ఖైరిగుర ఓసి పని స్థలాలు వీక్షించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలపై గని అధికారులు సిబ్బందికి మార్గ నిర్దేశం చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున పనులు వేగవంతం చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్