బెల్లంపల్లి: వైద్యులు సమయపాలన పాటించాలి

57చూసినవారు
బెల్లంపల్లి: వైద్యులు సమయపాలన పాటించాలి
బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మందులు నిలువలతో పాటు రికార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆసుపత్రిలోని వార్డులకు వెళ్లి రోగులతో మాట్లాడారు. వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. మందులు అన్నివేళల్లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారి రవికుమార్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్