బోథ్ నియోజకవర్గం తలమడుగు మండలం పల్సి(బి) తండాలో గుర్తు తెలియని మృతదేహం శుక్రవారం కలకలం రేపింది. అటవీ ప్రాంతంలో ఉరేసుకున్న వ్యక్తిని గ్రామానికి చెందిన సంతోష్ చూసి భయాందోళనకు గురయ్యాడు. గ్రామస్థులకు చెప్పడంతో ఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని చూస్తే చాలా రోజుల క్రితం ఉరేసుకుని ఉంటాడని స్థానికులు చెబుతున్నారు.