ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

570చూసినవారు
ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండ మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి 8వ వార్షికోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. అనంతరం మండల నాయకులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో మండల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్