తలమడుగు: వృద్ధాశ్రమంలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి కృషి

54చూసినవారు
తలమడుగు మండలం సాయిలింగి వృద్ధాశ్రమంలో నూతనంగా నిర్మించబడిన మొదటి అంతస్తు భవనాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షిషా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు తదితరులున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్