అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

59చూసినవారు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కోరారు. బుధవారం ఆయన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో క్రీడాకారులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ కార్యాలయంలోని 9160603222 నంబర్ ను సంప్రదిస్తే తామే ఓటు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్