రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

62చూసినవారు
రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
రాష్ట్రస్థాయి జూనియర్ బాల బాలికల సాఫ్ట్ బాల్ పోటీల్లో మంచిర్యాల జిల్లా బాలబాలికల జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈనెల 21 నుంచి జరుగుతున్న పోటీల్లో విద్యార్థులు పాల్గొని కాంస్య పతకం సాధించినట్లు జిల్లా అధ్యక్షుడు పోచన్న, ప్రధాన కార్యదర్శి కిరణ్ తెలిపారు. క్రీడాకారులను జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఆర్గనైజర్ సెక్రెటరీ వెంకటేష్, కోచ్ శివ పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్